PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రేస్ పార్టీకి పట్టం కట్టండి.. బాలస్వామి

1 min read

–రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రను జయప్రదం చేయండి
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలు కాంగ్రేస్ పార్టీకీ పట్టం కట్టాలని, దేశంలో నిరుద్యోగం, పేదరికం కులతత్వ పెరిగిపోతున్నాయని వీటిని దేశం నుండి పూర్తిగా నిర్మూలించడం కోసమే భారత్ జోడో యాత్ర అని కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి ,పీసీసీ సభ్యులు బాలస్వామి అన్నారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని భరత్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇంతియాజ్ బాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి సభ్యులు బాలస్వామి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జూడో యాత్ర ఈ నెల18న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుందని తెలిపారు.18 నుండి 22వ తేదీవరకు కొనసాగుతోందని ఈ పాదయాత్రను ఉమ్మడి కర్నూలు జిల్లా కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ,అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత్ జూడో యాత్ర ఇప్పటివరకు ఏ పార్టీ ఏ నాయకుడు కూడా నిర్వహించలేదని సుమారుగా 2500 కీ.మీ ఆరు నెలల్లో రాహుల్ గాంధీ పూర్తి చేశారన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్‌, పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. రైతులకు సాయం అందిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. మత ఘర్షణలు పెచ్చురిల్లుతున్నాయని తెలిపారు. దళితులు, బిసిలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. విభజన హామీలు నెరవేరాలన్నా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ పిసిసి కార్యవర్గ సభ్యులు నాగలింగం ,నంద్యాల పార్లమెంట్ యూత్ అధ్యక్షుడు పబ్బతి శ్రీరాములు, రుద్రవరం మాజీ సర్పంచు సుబ్బయ్య యాదవ్,పార్టీ సీనియర్ నాయకుడు మేకల దేవదాసు ,నాయకులు రమేష్ బాబు, సురేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author