ట్రాన్స్ఫారం కాంపౌండ్లో ప్రమాదకరంగా నీళ్లు నిల్వ
1 min read
హోళగుంద లొ నిన్న రాత్రి కురిసిన వర్షానికి సమ్మర్ స్టోరేజ్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫారం కాంపౌండ్ లో నీళ్ల వచ్చి ప్రమాదకరంగా మారిన సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే , పరిష్కారం చేయాలని ఎస్డిపిఐ డిమాండ్
న్యూస్ నేడు హొళగుంద: కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలంలో నిన్న రాత్రి వర్షం కురవడంతో ఎస్ ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫారం కాంపౌండ్ లో స్టార్టర్ డబ్బా దగ్గర ఎక్కువ నీళ్ల రావడంతో అక్కడున్న వ్యక్తి వీడియో తీసి గ్రూపులలో పెట్టడం జరిగింది. ఈ సమస్య తెలుసుకున్న ఎస్ డీ పి ఐ నాయకులు వెంటనే ఎస్ ఎస్ ట్యాంక్ దగ్గరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పర్యవేక్షించడం జరిగింది మరియు ఇతర సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది మారిన ట్రాన్స్ఫారం కాంపౌండ్లో నీళ్లు నిండిన చోట వెళ్ళి ఇతర సమస్యలు ను కూడా చూడటం జరిగింది. సందర్శించినంతరం ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కె.సలాం అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 9 వ వార్డు సభ్యులు ఎన్ సుబాన్ మాట్లాడు హొళగుంద గ్రామ మొత్తానికి త్రాగు నీరు సమ్మర్ లో స్టోరేజ్ ఫిల్టర్ చేసి ఇక్కడి నుంచి, విడుదల చేయడం జరుగుతుందన్నారు అయితే , సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాంట్రాక్టర్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు తాగునీటి సమస్య చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే ట్రాన్స్ఫర్ కాంపౌండ్ చాలా చిన్నగా కాంపౌండ్ లోపల నీళ్లు నిలబడే విధంగా ఉండడం వలన ప్రతి చిన్న వర్షానికి నీళ్లు నిలబడితే కరెంటు పోయినప్పుడు తిరిగి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాలంటే నీళ్లలో కరెంటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం వలన ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి ఉండడంతో అక్కడ పనిచేసే సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అందువలన సమస్య పరిష్కారం కావాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ను మార్చి వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని అలాగే ట్రాన్స్ఫారం కాంపౌండ్ హైట్ ను గ్రావెల్ పూడ్చి ఎత్తు పెంచాలని స్టార్టర్ బాక్స్ లను వర్షం వచ్చినా కూడా నీళ్లతో తడవకుండా సౌకర్యం చేయాలని అలాగే ఏ చిన్న మోటర్ రిపేర్ అయినా కూడా మూడు నాలుగు రోజులపాటు సమయం వృధా చేయకుండా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కారం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎస్డిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కే సలాం కార్యదర్శి హఫీజ్ కార్యవర్గ సభ్యులు బ్రాంచ్ ప్రెసిడెంట్ కే, జావీద్ ,సభ్యులు అబూబక్కర్ చికెన్ బక్షి, తదితరులు పాల్గొన్నారు.
