PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు                     

1 min read

– భక్తిశ్రద్ధలతో భక్తులు 108 ప్రదక్షణలతో మొక్కులు..

– వివిధ సేవల రూపేణ రూ:89,091/-లు ఆదాయం..

– 500 వందల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని,  శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకొన్నారు. ఈరోజు నైమిశారణ్యం పీఠాధిపతి శ్రీ బాలాబ్రహ్మానంద సరస్వతి స్వామీజీ వారిచే “సుందరాకాండలో హనుమ రహస్యం”  ప్రవచన కార్యక్రమము నిర్వహించబడినది. అటులనే ఏలూరు జిల్లా, కాట్రేనిపాడుకు చెందిన కోదండరామ భజనమండలి వారిచే హనుమాన్ చాలీసా నిర్వహించినారు. ఇటీవల సర్వీసు కమిషను ద్వారా ఎన్నిక కాబడిన తృతీయ శ్రేణి కార్యనిర్వహణాధికారులు తర్ఫీదు కొరకు ఈరోజు ఆలయమునకు విచ్చేసి అన్ని విభాగములలో వారి సందేహములను నివృత్తి  చేసుకొన్నారు. ఈరోజు మద్యాహ్నం  గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.89,091/- లు సమకూరినది.  సుమారు  500 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులుజవ్వాది కృష్ణ,  కురగంటి రంగారావుల    పర్యవేక్షణలో  తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు  సరిత విజయభాస్కర్ రెడ్డి  మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author