PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌ల్లిదండ్రుల‌కు ధ‌నుష్ లీగల్ నోటీస్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మధురైకు చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులకు హీరో ధనుష్ లీగ‌ల్ నోటీసులు పంపారు. ధ‌నుష్ తమ కొడుకే అంటూ గతేడాది నవంబర్‌లో మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. అతడు తమ మూడో కుమారుడని తెలిపారు. సినిమాల్లో నటించాలని ఉండటంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని పేర్కొన్నారు. అందువల్ల తమ ఖర్చుల కోసం నెలకు రూ. 65వేలు ఇవ్వాలని కోరారు. ఆ భార్యాభర్తలు చెప్పిన విషయాలతో ధనుష్ ఏకీభవించలేదు. తాను కస్తూరి రాజా, అతడి భార్య విజయలక్ష్మీకి జన్మించానని ధనుష్ తెలిపాడు. వివాదాన్ని పరిష్కారించుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. కానీ, ఆ సూచనకు ధనుష్, అతడి తరఫు న్యాయవాదులు అంగీకరించలేదు. తన జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో కోర్టు ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 2022లో కొట్టివేసింది. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ధనుష్ తాజాగా ఈ దంపతులకు లీగల్ నోటీసులు పంపించాడు.

                                

About Author