PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయి తేజ్ ను కాపాడిన వ్యక్తికి.. మెగా ఫ్యామిలీ బ‌హుమానం ఇచ్చిందా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని కేబ‌ల్ బ్రిడ్జ్-ఐకియా స‌మీపంలో బైక్ స్కిడ్ అయి ప్రముఖ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాల‌తో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయితేజ్ కి యాక్సిడెంట్ అయిన సంద‌ర్భంలో అత‌నిని కాపాడిన వ్యక్తి మ‌హ‌మ్మద్ ప‌ర్హాన్ . ప‌ర్హాన్ చేసిన స‌హాయానికి ప‌లువురు ఆయ‌న‌ను అభినందించారు. ఇది ఇలా ఉంటే.. సాయితేజ్ ను స‌రైన స‌మ‌యంలో స‌హాయం చేసినందుకు గాను మెగా ఫ్యామిలీ మ‌హ‌మ్మద్ ఫ‌ర్హాన్ కు కారు, డ‌బ్బు బహుమానం ఇచ్చిందంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విష‌యం పై ప‌ర్హాన్ స్పందించారు. త‌న‌కు ఎవ‌రూ ఎలాంటి స‌హాయం చేయ‌లేద‌ని, చిరంజీవి కుటుంబం నుంచి ఏ విధ‌మైన కాల్ కూడ రాలేద‌ని స్పష్టం చేశారు. ఈ విధంగా సోష‌ల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి పై రాయ‌దుర్గం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. ఇలాంటి ప్రచారాల వ‌ల్ల తాను, త‌న కుటుంబం ఇబ్బందుల‌కు గుర‌వుతున్నామ‌ని తెలిపారు.

About Author