PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

1 min read
భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్న కర్నూలు రేంజ్​ డీఐజీ వెంకట రామిరెడ్డి

భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్న కర్నూలు రేంజ్​ డీఐజీ వెంకట రామిరెడ్డి

పల్లెవెలుగు వెబ్​, కల్లూరు : పరిషత్​ ఎన్నికల నేపథ్యంలో గురువారం కర్నూలు రేంజ్​ డీఐజీ పి. వెంకటరామిరెడ్డి ఉలింద కొండ ఎన్నికల పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీంగ్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండి విధులు చేపట్టాలని కర్నూలు రేంజ్ డిఐజి పోలీసు అధికారులను ఆదేశించారు. డిఐజి వెంట ఎస్సీ ఎస్టి సెల్ డిఎస్పీ రామాంజి నాయక్, కర్నూల్ రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, ఉలింద కొండ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ఉన్నారు.

About Author