PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శనగ విత్తనాలను పంపిణీ

1 min read

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి.మోహన్
పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: మండల కేంద్రమైన మిడుతూరు,తలముడిపి గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో శనగ విత్తనాలను నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి.మోహన్ రావు పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు ఈకేవైసి చేయించుకోవాలని తెలియజేశారు.అంతేకాకుండా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రాయితీలు మీకు రావాలంటే ఈకేవైసి చేయించుకోవాలని లేకపోతే రాయితీలు రావని అన్నారు.పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని అంతేకాకుండా రైతుల దగ్గరికి వెళ్లి పంట నమోదును త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన తెలియజేశారు.ఈకార్యక్రమంలో గ్రామ వ్యవసాయ అధికారులు షబాన,అశోక్ మరియు రైతులు పాల్గొన్నారు.

About Author