ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ…
1 min read
న్యూస్ నేడు హొళగుంద: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హెబ్బటం గ్రామ ఉప సర్పంచ్ , టీడీపీ యూనిట్ ఇంచార్జ్ బి. సవారప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు హొళగుంద మండలం హెబ్బటం గ్రామం నందు ఉప సర్పంచ్, టీడీపీ యూనిట్ ఇంచార్జ్ బి. సవారప్ప మరియు బూత్ ఇంచార్జ్ లు,బి. మల్లికార్జున, కె. గోపాల్, శేక్షవలి, మండల టీడీపీ రైతు సంఘం కమిటీ మెంబెర్, బి. శేఖర్ మాట్లాడుతూ వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు మరియు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా గ్రామలలో ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్నారు,మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేధ శక్తితో పెట్టుబడులు వస్తున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ,రాష్ట్రానికి ఆదాయం తో అభివృద్ధి సంక్షేమం అందిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమములో కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.