సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ
1 min read
న్యూస్ నేడు చెన్నూరు : జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ పాఠశాల పున ప్రారంభం గురువారం అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ఎస్ఎస్ ఏ ఏపీసి నిత్యానంద రాజు మండల అధికారులు పాల్గొని విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఎస్ ఏ ఎ పి సి నిత్యానంద రాజు, ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు లు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం పునః ప్రారంభం రోజునే కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన పాఠ్య పుస్తకాలు చాలా చక్కగా ఉన్నాయని వీటిని ప్రతి విద్యార్థి ఒక భగవద్గీతల ఒక ఖురాన్ల, ఒక బైబిల్ తో సమానంగా భావించి వాటిని చక్కగా వినియోగించుకుని మరింత శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తన తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకొచ్చి చదివిన పాఠశాలకు మంచి గౌరవం తీసుకురావాలని ఆయన విద్యార్థులను కోరారు. గత సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించడమే కాకుండా, కన్న తల్లిదండ్రులకు విద్యను నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావడం జరిగిందని ఇలాగే విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆయన విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏపీ సి నిత్యానంద రాజు, తాసిల్దార్ సరస్వతి, ఎంఈఓ2 సునీత, ఏ ఎం ఓ వీరేంద్ర, విశ్వనాథరెడ్డి, రమణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.