PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: ఈనెల 28వ తేదీ నుండి, 30వ తేదీ వరకు విజయవాడ లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కు సంబంధించి వైయస్సార్ జిల్లా నుండి దాదాపు 40 మంది, యువతీ యువకులు రాష్ట్ర స్థాయి నెట్ బాల్ టోర్నమెంటులో పాల్గొనడం జరుగుతుందని రామనపల్లి హెడ్మాస్టర్ రఘునాథరెడ్డి, అలాగే పిడి రెడ్డయ్యలు తెలిపారు, శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ, వైయస్సార్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి నెట్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొనే యువతీ యువకులకు బి ఎస్ ఆర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గ్రూప్ మేనేజర్ రహమతుల్లా, అలాగే రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి లు శుక్రవారం రామన పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నెట్ బాల్ క్రీడాకారులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశారు, అలాగే ఈ నెట్ బాల్ లో పాల్గొనే యువతీ యువకులు ఆటలో బాగా రాణించి మండలానికి, అదేవిధంగా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author