PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యధావిధిగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ..

1 min read

– అక్టోబర్ నెల 2,80,413 మందికి రూ. 77.83 కోట్లు విడుదల..

– డిఆర్ డిఏ పిడి డా:ఆర్. విజయరాజు వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక  అక్టోబర్ నెల 2,80,413 మందికి రూ. 77.83 కోట్లు విడుదల చేయడమైనదని డిఆర్ డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఆర్. విజయరాజు శనివారం ఒకప్రకటనలో తెలిపారు. జిల్లాలో  అక్టోబరు 1వ తేదీ ఆదివారం  ఉదయం 6.00 గంటల నుండి పెన్షన్లు పంపిణీ ప్రారంభం అవుతాయని ఆయన తెలియజేశారు. ఆక్టోబర్ 1 వతేదీ ఆదివారం ,  2 వ తేదీ సోమవారం గాంధీ జయంతి  వరుస సెలవు దినములు అయిన పింఛను  పంపిణీ  యధావిధిగా సచివాలయ సిబ్బంది , వాలంటీర్ల ద్వారా  జిల్లాలో పింఛను పంపిణీ   జరుగుతుందన్నారు.

About Author