NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బి జే  పి అధికార ప్రతినిధిగా డా. పాలగిరి శ్రీనివాస్ కుమార్ రాజు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధిగా డాక్టర్ పాలగిరి శ్రీనివాస్ కుమార్ రాజును నియమిస్తూ పార్టీ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.రాయచోటి పట్టణానికి చెందిన డాక్టర్ పాలగిరి శ్రీనివాస్ కుమార్ రాజు గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే గతంలో రాయచోటి అసెంబ్లీ కన్వీనర్ గా,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా,రాష్ట్ర మేధావుల సంఘం సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ఎనలేని సేవ చేశారు. అయన కృషిని సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధిగా నియమించేందుకు సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి,జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ కు,రాజంపేట పార్లమెంటు బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్ లతో పాటు రాయచోటి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,రాజంపేట పార్లమెంట్ జిల్లా నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

About Author