PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైనేజీ ప్రధాన కాలువ పనులు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు కొత్త గాంధీ నగర్ డ్రైనేజీ ప్రధాన కాలువ పనులను కాంట్రాక్టర్ నీలం వెంకటసుబ్బారెడ్డి, శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పెడబల్లె జయభారత్ రెడ్డి లు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి నిధులనుండి 45 లక్షల రూపాయలతో రాజుల కాలనీ వద్ద నుండి, సరస్వతి నగర్, లక్ష్మీ నగర్, యానాదికాలని, గాంధీనగర్ ల మీదుగా బెస్త కాలనీ ప్రధాన డ్రైనేజీ కి కలపడం జరుగుతుందన్నారు, ఇప్పటికే టెండర్ పూర్తయి టెండర్ను నీలం వెంకటసుబ్బారెడ్డి దక్కించుకోవడం జరిగిందన్నారు, ఆయన ఈ పనులను చేపడతారని త్వరలోనే పనులు పూర్తి చేసి తద్వారా రాజుల కాలనీ, సరస్వతి నగర్, లక్ష్మీ నగర్, యానాది కాలనీ, గాంధీనగర్ ప్రజల డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు, ఈ కాలనీలకు సంబంధించిన డ్రైనేజీ నీరంతా కూడా తగ్గు భాగమైన దిగువన ఈ ప్రధాన కాలువలో కలుస్తుందని ఆయన తెలిపారు, ప్రస్తుతం ఈ ప్రధాన డ్రైనేజీ లేకపోవడంతో ఇక్కడ ప్రజలు డ్రైనేజీ నీళ్లు పోక ఇంటిముందు అటు వర్షపు నీరు, ఇటు డ్రైనేజీ నీరు చేరడంతో దిగువన ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు, ఈ డ్రైనేజీ పూర్తి అయితే ఇక్కడి ప్రజల డ్రైనేజీ సమస్యలు తీరిపోతాయని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ నీలం వెంకటసుబ్బారెడ్డి స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు చంద్ర, బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author