PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధిక ధరలతో సామాన్యునికి చుక్కలు..

1 min read

– టిడిపి పాణ్యం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
పల్లెవెలుగు, వెబ్​ పాణ్యం:శుక్రవారం నాడు పాణ్యం మండలంలోని బలపనూరు గ్రామంలో ,టీడీపీ ఇంచార్జి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలిసి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు . గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలు విద్యుత్ చార్జీలు ఆర్టీసీ చార్జీలను మరియు పెట్రోలు డీజిల్ ధరల పెంచి వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన అధిక ధరల భారం మోపిందని ప్రజలకు నవరత్నాలు అంటూ ఎటువంటి అభివృద్ధి చేయకుండా అప్పులు తెచ్చి ప్రజలకు అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని వైసిపి పాలనలో ప్రజల బాదుడే బాదుడు సంభందించి కరపత్రాలను పంపిణి చేసి వైసీపీ పాలనలో పేద బడుగుబలహీన వర్గాల ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం మోపుతున్న భారాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు. గ్రామ నాయకులు శివ శంకర్ రెడ్డి,సునీల్ రెడ్డి,రమేష్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి, శేక్ష వలి,రామ్ చంద్ర రెడ్డి, మండల అధ్యక్షుడు జయరామి రెడ్డి మండల ముఖ్య నాయకులు రాం పుల్లా రెడ్డి,రమణ మూర్తి, కౌలురు భాస్కర్ రెడ్డి,ఆలమూరు శేఖర్ రెడ్డి,కుమార్ రెడ్డి,రామ్మోహన్ నాయుడు,బి టెక్ పుల్లా రెడ్డి,ఖాదర్ బాషా,అమర సింహా రెడ్డి,ఎంపీటీసీ రంగ,ఇప్ప సుధాకర్, రమేష్,మోహన్, కందికాయపల్లే ఈశ్వర్, పిన్నా పురం రమణ,భూపనపాడు సునీల్,గొరుకల్లు వెంకటేష్,మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author