PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈడిగ శివకుమార్ గౌడ్ సంతాప సభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కౌతాళం మండల కేంద్రంలో ఈరోజు ఈడిగ శివకుమార్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కౌతాళం మండల కేంద్రంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఆ గత వారం రోజుల క్రిందట హత్తుకు గురైన విషయం అందరికీ తెలిసినదే శివ కుమార్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భారతీయ జనతా పార్టీ ఆదేశాలు మేరకు ఆయనకు ఘన నివాళులు అర్పించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆదోని డివిజన్ ఇంచార్జ్ బి పురుషోత్తం రెడ్డి మరియు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ మరియు మంత్రాలయం నియోజకవర్గం లోని వివిధ మండలాల బిజెపి నాయకులు మరియు గ్రామాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని శివకుమార్ గౌడ్, చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలకు అండగా ఉంటామని ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వారికి అన్నివేళలా ఆదుకుంటామని అన్నారు అదేవిధంగా ఎవరైతే శివ కుమార్ గౌడ్ హత్యకు పాల్పడినారో, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. శివకుమార్ గౌడ్ కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా శివకుమార్ గౌడ్ కుమారుడు పేరు మీద ఎల్ఐసి లో లక్ష రూపాయలను ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగిందని, బి .పురుషోత్తం రెడ్డి అన్నారు.మరియు కార్యకర్తలకు అన్నివేళలా ఆదుకుంటామని బిజెపి పార్టీని మరింత బలపేతం చేయాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ మరియు బిజెపి కోసిగి మండల అధ్యక్షులు పెండేకల్ రాముడు బిజెపి మండల నాయకులు ఈడిగ హనుమంతు గౌడ్, బిజెపి మైనారిటీ ఉపాధ్యక్షులు మైబు, కామవరం వెంకటరెడ్డి, చిరుతపల్లి ఈరన్న, గుడి కంబల్ శ్రీనివాసులు, బిజెపి మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు నబీసాబ్, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాముడు మరియు నియోజకవర్గంలోని బిజెపి కార్యకర్తలు మరియు మండలోని బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author