PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శిగా ఎన్నిక

1 min read

పల్లెవెలుగు , వెబ్​ పాణ్యం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చం నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయము లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా పాణ్యం గ్రామానికి చెందిన మీనిగ రామ్మోహన్ నాయుడు (లాయర్ బాబు) ఎన్నికవ్వడంతో శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పార్టీ ఇచ్చిన ఈ బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తానని తెలిపారు అనంతరం మర్యాదపూర్వకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇన్చార్జి గౌరు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీకి న్యాయ సలహాలు సేవలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

About Author