NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

1 min read

రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు ప్రార్ధ సారథి

ఈడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ది బోయిన శివప్రసాద్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు నగర అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి ‘ఈడా’ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పెద్దిబోయిన శివప్రసాద్ కు సూచించారు. స్థానిక చలసాని గార్డెన్స్ లో సోమవారం ‘ఈడా’ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ సభలో మంత్రి కొలుసు పార్థసారధి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ అంకితభావంతో ప్రజలకు సేవలుచేసే వారికి పదవులు లభిస్తాయడానికి ‘ఈడా’ చైర్మన్  శివప్రసాద్ నిదర్శనమన్నారు. ప్రజలకు శివప్రసాద్ చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం   ‘ఈడా’ చైర్మన్ గా నియమించిందని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు. నామినేటెడ్ పదవులలో సామాజిక నాయ్యం పాటిస్తున్నామని, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు, హింసించడమే లక్ష్యంగా పనిచేసిందని, ఆనాటి కష్టకాలంలో ఎందరో కార్యకర్తలు, నాయకులు పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు గా పాలన చేస్తున్నదన్నారు.  ‘ఈడా’ చైర్మన్ ప్రమాణస్వీకారం చేసిన పెద్దిబోయిన శివప్రసాద్ మాట్లాడుతూ తనకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ,  ఏలూరు నగరాభివృద్ధికి తానూ శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం. ఆర్. పెదబాబు, మాజీ మంత్రి మారడాని  రంగారావు, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీరామకృష్ణ, కూటమి నాయకులూ పుప్పాల జగదీష్ బాబు,  చోడే వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, మధ్యాహ్నపు బలరాం, ప్రభృతులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి కొలుసు పార్థసారధిని గజమాలతో సత్కరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *