PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

1 min read

చెంచుగూడెంలో మొక్కలు నాటుతున్న పారెస్టర్​ కిశోర్​ కుమార్​

పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత డి. వనిపెంట  సెక్షన్ పారెస్టర్‌ కిషోర్ కుమార్‌ తెలిపారు. రుద్రవరం రేంజ్‌ అధికారి శ్రీపతి నాయుడు ఆదేశాలతో మండలంలోని డి. వనిపెంట చెంచుగూడెంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మొక్కులను పెంచడం వలన కలిగే లాభాలను చెంచులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణకై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెంచులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎప్‌బిఓలు నాగేష్‌,సుభాష్,మదన్,విఎస్‌ఎస్‌ సభ్యులు,వాలంటీర్లు,బర్డ్స్‌ సొసైటి సభ్యులు పాల్గొన్నారు.

About Author