NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఖరీఫ్ పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

1 min read

చెన్నూరు , న్యూస్ నేడు : ఖరీఫ్ లో సాగు చేసి పంటలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రత్నకుమార్ రైతులను ఉద్దేశించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బుధవారం వికసిత కృషి  విజ్ఞాన అభియాన్ కార్యక్రమంలో భాగంగా  మండల పరిధిలోని   బయనపల్లి, రామణపల్లి  గ్రామాల నందు రైతులను సమావేశపరచి వారికి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రత్నాకుమార్   ఖరీఫ్ పంట కాలం ముందు రైతులు సాగు చేసే పంటలపై తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన యాజమాన్య పద్ధతులు గురించి తగు సూచనలను సలహాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 700 జిల్లాలలో రెండువేల కంటే ఎక్కువ శాస్త్రీయ బృందాల భాగస్వామ్యంతో నూతన సాంకేతిక  ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించడం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన రైతులకు తెలియజేశారు. ముఖ్యంగా వరి లో  మేలైన రకాలు  యాజమాన్య పద్ధతులు, అలాగే వేరుశనగ లో రకాలు పోషక యాజమాన్యo, సూక్ష్మ నీటి ద్వారా సాగులో సాంకేతికత  కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆయన రైతులకు సవివరంగా తెలియజేయడం జరిగింది.  సమన్వయకర్త డాక్టర్ ఏ. వీరయ్య మాట్లాడుతూ , భూసార పరీక్షల ప్రాముఖ్యత  వాటినీ అనుసరించాల్సిన విధానం గురించి ఎరువుల వాడకంలో యాజమాన్యం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, వరిలో పొటాషియం వినియోగం యొక్క ప్రాముఖ్యత గురించి, కాంప్లెక్స్ ఎరువుల వాడకం పై ఆయన రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా , పురుగు మందులు, పంటలలో వచ్చే తెగుళ్ల  గురించి వాటినిఏవిధంగా అధిగమించవచ్చునో తెలియజేశారు. డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ,  రైతులు అధిక  రాబడి వచ్చేలా పెట్టుబడి తగ్గించేలా చిన్న పాటి మెలుకువలు, నేల సమతుల్యతను పెంచేలా పచ్చిరొట్ట పైర్లు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువుల గురించి తెలియజేశారు. డా..వెంకట సుబ్బయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ, చీనీ, నిమ్మ లో మొక్కల ఎంపిక నుండి కాయ కోత దాకా మేలైన యాజమాన్య పద్ధతుల తో పాటు చిన్నపాటి జాగ్రత్తలను పాటించాలని తెలిపారు, తమలపాకు తోటల గురించి  కూరగాయల సాగు ఏ విధంగా చేయాలి వాటి విధి విధానాల గురించి వివరించారు. డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి శాస్త్రవేత్త మాట్లాడుతూ,  పశుగ్రాసాల పెంపకం గురించి, పోషక యాజమాన్యం గురించి, గొర్రెల, మేకల పెంపకం గురించి, వ్యాధుల వాటిల్లో వ్యాధులు, వాడవలసిన మందులు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. అలాగే  కోళ్లల్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి పశువిభాగానికి సంబంధించిన జాతీయ పథకాల గురించి టీకాల గురించి  లింగ నిర్ధారిత వీర్య పథకం గురించి రైతులకు తెలియజేశారు. డా . కే సాయి మహేశ్వరి, శాస్త్రవేత్త మాట్లాడుతూ, వరి, నువ్వులు వంటి పంటలలో కలుపు యజమాన్యం గురించి వివరించారు. శ్రీదేవి మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఉన్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, రైతు నమోదు, కిసాన్ డ్రోన్ వంటి పథకాల గురించి వివరిస్తూ వాటికి కావలసిన సాంకేతిక విషయాల గురించి రైతులకు తెలియజేశారు. బయనపల్లి సర్పంచ్ తుంగ చంద్ర శేఖర్ యాదవ్ మాట్లాడుతూ,  శాస్త్రవేత్తల సలహాలతో రైతులు అధిక రాబడి వచ్చేలా ముందుకు సాగాలని, ఏవైనా సమస్యలు ఉంటే  రైతులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వారికి సరైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో.  గ్రామీణ వ్యవసాయ అధికారులు సాయి, సునీల్, ఆత్మ బిటిఏం రాంకుమార్ భారీగా రైతులు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *