PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంట‌ల వ్య‌వ‌ధి.. ఒకే ప్ర‌దేశంలో ఐదుగురి మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపాయి. గంటల వ్యవధిలోనే ఒకే ప్రాంతంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నిన్న చౌటుప్పల్ మండలం లింగోజి గూడెం వద్ద బైక్ పై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఓ కారు ఢీ కొట్టింది. తండ్రి మృతి చెందగా.. కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు గంటల తర్వాత అదే ప్రాంతంలో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా.. గరుడ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకులు చందు, పృథ్వి రాజ్ ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు.

                                  

About Author