PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుధ్యంపై దృష్టి సారించండి..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ చాగలమర్రి  : గ్రామాల్లో కార్యదర్శులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈఓఆర్‌డి నాగేంద్రయ్య  సూచించారు . శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండటంతో వీధుల్లో నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపించే ప్రమాదం ఉందని అన్నారు . పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే గ్రామాలలో మురికి కాలువలను శుభ్రం చేసి మురికి నీరు ఉన్న ప్రాంతాలలో,బ్లీచింగ్‌ పౌడర్‌,వేస్ట్‌ ఆయిల్‌ చల్లించాలన్నారు.కార్యక్రమం లో ఈఓ సుదర్సనరావు,పంచాయతీ,సచివాలయాల కార్యదర్సులు పాల్గొన్నారు.

About Author