PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

45 కి.మీట‌ర్ల‌కు రూ. 2935 బిల్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఓలా, ఉబ‌ర్ ల‌తో బిల్లు వాచిపోతున్నాయి. ప్ర‌యాణీకుల జేబులు గుల్ల‌వుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన దేబర్షి దాస్‌గుప్తా.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లోని టర్మినల్ 2 నుంచి నోయిడాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు ఉబెర్‌ను ఆశ్రయించాడు. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బిల్లు చెల్లించబోయి.. ఒక్కసారిగా షాకయ్యాడు. కేవలం 45 కిలో మీటర్ల ప్రయాణానికి రూ.2,935 బిల్ రావడంతో కంగుతిన్నాడు. చివరికి చేసేదేమీ లేక.. ఆ మొత్తాన్ని చెల్లించేశాడు. అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ‘నేను 45 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. 149 కిలో మీటర్ల ప్రయాణించినట్లు ఉబెర్‌లో చూపించిందని.. అందుకుగాను రూ.2,935 బిల్లు చెల్లించాల్సి వచ్చింది’ అని వాపోయాడు.

                                            

About Author