మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే….
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఓరకల్లు మండలం మీదివేముల గ్రామంలో ఈనెల 5వ తేదీన హత్యకు గురైన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి పరామర్శించిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి!!!హత్యకు గురైన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి రమేష్ నాయుడు కుటుంబానికి 2 లక్షల రూపాయలు చెక్కును అందజేసి కాటసాని రాంభూపాల్ రెడ్డి తరపున 50వేల రూపాయలు నగదును వారి కుటుంబానికి అందజేశారు..ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి , జడ్పిటిసి రంగనాథ్ గౌడ్ , ఎంపీపీ తిప్పన్న, వైఎస్ఆర్సిపి పార్టీ మండల కన్వీనర్ చెన్నారెడ్డి , ఎంపిటిసి పద్మనాభ రెడ్డి , వైఎస్ఆర్సిపి రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీ తిప్పాయపల్లే హరినాథ్ రెడ్డి , మాజీ ఎంపిటిసి భాస్కర్ , పూడిచెర్ల మహేశ్వర రెడ్డి , నాగ తిరుపాల్ , శకునాల ఎంపిటిసి ప్రవీణ్ కుమార్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , గుట్టపాడు సుంకి రెడ్డి , హుస్సేనాపురం చిన్న అయ్యన్న , శకునాల పుల్లారెడ్డి , గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.