PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బహిష్కరణ

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరో నేతపై వేటు వేసింది. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవరి ఏసు దాస్ (డీ వై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ వైసీపీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీ వై దాస్ పై బహిష్కరణ వేటు వేసినట్లు వైసీపీ తన ప్రకటనలో పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా దాస్ పై ఫిర్యాదులు వచ్చినట్లు వైసీపీ తెలిపింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి పార్టీ అధినేతకు నివేదిక అందించగా… దాస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని జగన్ ఆదేశించినట్లుగా వైసీపీ తన ప్రకటనలో తెలిపింది.

                  

About Author