గ్రామాల్లో వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన
1 min read
నూతన వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేయనున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గ్రామాల్లో ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం వాటర్ ట్యాంకులను నిర్మిస్తుందని దీనిలో భాగంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ యుద్ధ ప్రాతిపాదించిన వాటర్ ట్యాంకులను మంజూరు చేయనున్నారు.దెందులూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరు నాని బాబు, మండల పార్టీ కార్యదర్శి నాగన్న బోయిన సత్యనారాయణ అన్నారు. శుక్రవారం దెందులూరు మండలం చల్ల చింతలపూడి కొత్త కమ్మవారిగూడెం గ్రామాల్లో నూతన వాటర్ ట్యాంకులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం ఉదయం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో స్థలాలను మండల టిడిపి అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ మాజీ సర్పంచ్ ముమ్మడి మోహనరావు గ్రామ టిడిపి అధ్యక్షులు వేమన రాము గౌడ్ తూంపాటి ఆంజనేయులు యాస మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుసులూరి ప్రసాద్, త్రాగునీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్ డిఈ డి.రామారావు, ఏఈ చింతమనేని వర్మతో కలిసి పలువురు నాయకులు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దెందులూరు మండల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ చల్ల చింతలపూడిలో ఒక వాటర్ ట్యాంకు కొత్త కమ్మవారిగూడెంలో ఒకటి గాలాయగూడెంలో ఒకటి గోపన్నపాలెం గ్రామంలో ఒకటి కొత్తపల్లిలో ఒకటి సోమవారం పాడులో ఒకటి సోమవరపుపాడు ఆర్టీసీ కాలనీలో ఒకటి చొప్పున వాటర్ ట్యాంకులను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ శనివారం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వారి వెంట పార్టీ సీనియర్ నాయకులు యలమర్తి శ్రీనివాస్, పావులూరు దశరథ రామయ్య, మోదుగుముడి రాంబాబు, పూజారి శ్రీనివాసరావు, గోపన పాలెం పార్టీ అధ్యక్షులు చింతా సుబ్బారావు, మారగాని సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, మాగంటి గిరిబాబు, మాగంటి నాని, బొడ్డేటి మోహన్ బాబు, గారపాటి కొండయ్య చౌదరి, తో పాటు పలువు నాయకులు ఉన్నారు.