PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాలుగోసారి పెట్రోల్ ధ‌ర‌లు పెంపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కేవలం ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో శనివారం పెట్రోల్ లీటరు ధర రూ.98.61కి, డీజిల్ లీటరు ధర రూ.89.87కు పెరిగింది.పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. చమురు సంస్థలు వరుసగా పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచడం వల్ల పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.3.20 పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు చమురు ధరలను కేంద్రం పెంచలేదు.

                                       

About Author