PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంధ‌న పొదుపు అంద‌రి బాధ్య‌త‌..

1 min read

ఏలూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ బి. లావణ్య వేణి

ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు జాతీయ ఇoదన పొదుపు వారోత్సవాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఇంధ‌న పొదుపు అంద‌రి బాధ్య‌త అని, ఇంధ‌నాన్ని ఆదా చేయ‌డంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ బి. లావణ్య వేణి పిలుపునిచ్చారు.ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో గురువారం ఉదయం  క‌లెక్ట‌రేట్‌ వద్ద జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఇంధన పొదుపు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరచేందుకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి జాయింట్ క‌లెక్ట‌ర్ బి.లావణ్య వేణి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్ ఆర్ పేట లోని విద్యుత్తు సౌధ భవనం  కూడలి వరకు నిర్వ‌హించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా   జాయింట్ కలెక్టర్ బి .లావణ్య వేణి మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఇంధన పొదుపు అంశంపై 20వ తేదీ వరకు రోజుకు ఒక అంశంపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల్లో ఇంధ‌న పొదుపుపై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ఈ ఉత్స‌వాలు దోహ‌దం చేస్తాయ‌న్నారు. అవ‌స‌రం మేర‌కు మాత్ర‌మే విద్యుత్‌ను వినియోగించాల‌ని,  ఎల్ఈడీ బ‌ల్బుల వినియోగం వ‌ల్ల విద్యుత్ ఆదా అవుతుంద‌ని.. అందుకే ఈ బ‌ల్బుల వినియోగాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇళ్లలో వీలైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేసే స్టార్ రేటెడ్ ఉప‌క‌ర‌ణాల‌ను ఉప‌యోగించాల‌న్నారు. సుస్థిర భ‌విష్య‌త్ కోసం ఇంధ‌న పొదుపు అత్యావ‌శ్య‌క‌మ‌ని.. భావిత‌రాల భ‌ద్ర‌త కోసం ఇంధ‌నాన్ని పొదుపుగా ఉప‌యోగించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని జెసి  పిలుపునిచ్చారు.కార్య‌క్ర‌మంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు, డీఈలు  ఏఈలు, విద్యుత్ ఉద్యోగులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

About Author