PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెయిల్ డైరెక్ట‌ర్ అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ల‌ంచాలు తీసుకున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో గెయిల్ డైరెక్ట‌ర్ రంగ‌నాథన్ ను సీబీఐ అరెస్టు చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్‌ 2021లో గెయిల్‌ డైరెక్టర్‌ను ఇరువురు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ వివరించింది. పెట్రో కెమికల్‌ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు.

                                         

About Author