PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాకు న్యాయం జరిపించండి .. సేవ మరియమ్మ

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: మాకు న్యాయం జరిపించండి.అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కలిసిన రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ సేవ నాగ జగన్ బాబురావు భార్య సేవ మరియమ్మ, వినతి పత్రం సమర్పించింది.ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ముదినేపల్లి మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ సేవ నాగ జగన్ బాబురావు భార్య సేవ మరియమ్మ మంగళవారం స్థానిక రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ,కలిసి విజయవాడలోని తన చాంబర్లో మరియమ్మ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, తన కుమారులు ,నా భర్త నాగ జగన్ బాబురావు మీద తప్పుడు కేసులు పెట్టి, వేధిస్తున్నాడని వైఎస్ఆర్ పార్టీ అభిమానులమైన మేము కైకలూరు నియోజకవర్గం లో వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు జరిగిన అన్యాయం విషయమై, ప్రశ్నించినందుకు నా భర్తని నా కుటుంబాన్ని దారుణంగా వేధిస్తున్నారని, కైకలూరుపోలీసు వారు నా భర్తని పదేపదే స్టేషన్ కి తీసుకెళ్తున్నారని, ఎస్సీ కమిషన్ కి పత్రం ద్వారా మరియమ్మ విన్నవించుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆఫీసర్స్ కు రాసి మీకు న్యాయం జరిగేలాగా చూస్తానని  హామీ ఇవ్వడం జరిగిందని ఆమె ప్రకటన ద్వారా తెలియజేశారు.

About Author