యోగాతో లక్ష్యాలను సాధించవచ్చు…
1 min read
పాల్గొన్న 100మంది ప్రభుత్వ ప్రైవేట్ అధ్యాపకులు,ఆయుష్ వైద్యాధికారులు,ఫిజికల్ డైరెక్టర్లు,లైబ్రరియన్లు
ఆర్ఐఓ కూరపాటి యోహాన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :యోగాంధ్రలో ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయం అధికారులు,సిబ్బంది యోగాంధ్రలో ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయం సిబ్బంది,ప్రభుత్వ,ప్రైవేటు అధ్యాపకులు ఆయుష్ వైద్యాధికారులు,పిజికల్ డైరెక్టర్లు, లైబ్రరియన్లు సుమారు 100 మంది పాల్గొన్నారని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐవో) కూరపాటి యోహాన్ తెలిపారు.యోగాంద్ర మాస వేడుకల కార్యక్రమాలలో భాగంగా శనివారం స్ధానిక వట్లూరు టిటిడిసిలో నిర్వహించిన యోగాభ్యాసన కార్యక్రమంలో పలువురు పాల్గొని యోగా అభ్యాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐవో కె.యోహాన్ మాట్లాడుతూ యోగా ఆసనాలతో శారీరక,మానసిక ఉల్లాసం,ఒత్తిడి తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు.యోగా కార్యక్రమం ఒక్కరోజు కార్యక్రమం కాదని ప్రతీరోజు కొంత సమయాన్ని కేటాయించి యోగా ఆసనాలు చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు జీవితంలో మన సాధించవలసిన లక్ష్యాలను సాధించగలుగుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐవో కార్యాలయం అధికారులు, సిబ్బంది,ప్రభుత్వ,ప్రైవేటు అధ్యాపకులు,ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరియన్లు,ఆయుష్ శాఖ వైద్యాధికారులు,తదితరులు పాల్గొన్నారు.