PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలిటిక్స్ కు గుడ్ బై.. స‌న్యాసం స్వీక‌ర‌ణ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్ణాట‌క‌ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ బీజే పుట్టస్వామి రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు. ఈ నెల 6న సన్యాసం స్వీకరించనున్నారు. అదే రోజు ఆయన రాజకీయాలకు పూర్తిగా ఇక గుడ్‌బై చెప్పనున్నారు. బెంగళూరు రాజరాజేశ్వరి దేవస్థానానికి చెందిన కైలా మఠాధిపతి జయేంద్ర తీర్థపురి స్వామిజీ నుంచి సన్యాస దీక్ష చేపట్టిన తర్వాత ఈ నెల 15న తైలేశ్వర గాణిగర మహాసంస్థానానికి తొలి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజకీయ నేతగా తన చిట్టచివరి విలేకరుల సమావేశాన్ని బెంగళూరులో మంగళవారం ఆయన నిర్వహించి స్వయంగా ఈ విషయాలన్నీ మీడియాకు చెప్పారు. తన ఐదుశాబ్దాల రాజకీయ జీవితంలోని అనేక ప్ర ముఖ ఘట్టాలను మీడియాతో పంచుకున్నారు.

                                         

About Author