PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా థియేట‌ర్ల‌కు గుడ్ న్యూస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. తెలంగాణలో సినిమా టికెట్ల ధ‌ర‌లను స్ప‌ష్టంగా ప్ర‌క‌టిస్తూ జీవో జారీ చేసింది. ఎ.సి థియేటర్స్‌లో టికెట్‌ కనీస ధర రూ.50 + జీఎస్‌టీ, నాన్‌ ఎ.సి. 30+ జీఎస్‌టీ, మల్టీప్లెక్స్‌ అయితే రూ.100 +జీఎస్‌టీ ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎ.సి థియేటర్స్‌లో గరిష్ఠ ధర రూ.100 + జీఎస్‌టీ, నాన్‌ ఎ.సి. 70+ జీఎస్‌టీ, సింగిల్‌ థియేటర్‌ రిక్లైనర్‌ సీట్‌: 200+జీఎస్‌టీ, బిగ్‌ స్కీన్‌ అయితే రూ.250 +జీఎస్‌టీ, మల్టీప్లెక్స్‌ 250 +జీఎస్‌టీ, రిక్లైనర్‌ 300+జీఎస్‌టీ చెల్లించాల్సిందింగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

                            

About Author