PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ చౌక బియ్యం పట్టివేత

1 min read

పల్లెవెలుగువెబ్​, చెన్నూరు: కడప జిల్లా చెన్నూరు  కొండపేట నుండి ఖాజీపేటకు పోవు రోడ్డు లో KC కాలువ వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ చౌక బియ్యాన్ని పట్టుకొని  బొలెరో వాహనాన్ని , డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు  SI , శ్రీనివాసులురెడ్డి తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, కొండ పేట నుండి కాజీపేట కు పోవు రోడ్డు లో కె సి కెనాల్ వద్ద అక్రమంగా ప్రభుత్వ సౌకర్యాన్ని తరలిస్తున్నారు అన్న పక్క సమాచారంతో పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీ చేయుచుండగా,  ఒక బొలెరో వాహనంలో ప్రభుత్వ చౌక బియ్యం లోడ్ చేసుకొని  బియ్యం వ్యాపారస్తులకు అమ్ముకొనుటకు కాజీపేట వైపు గల జాతీయ రహదారి వైపువస్తూ ఉండగా అనుమానంతో ఆపి తనిఖీ చేయగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 58 బస్తాల చౌక బియ్యాన్ని అలాగే  వాహనము డ్రైవర్ షేక్ అలీముద్దీన్  అను వ్యక్తిని అదుపులోకి తీసుకొని, వాహనంలో ఉండిన 58 బస్తాలలోని సుమారు 2320 కేజీల చౌక బియ్యం అదేవిధంగా సదరు బొలెరో వాహనం ను  పెద్దమనుషుల సమక్షంలో తదుపరి చర్యల నిమిత్తం స్వాధీన పరచుకోవడ మైనదని పోలీసులు తెలిపారు, కాగా డ్రైవర్ ను విచారించగా పార్కు వీధికి చెందిన ఓబులరెడ్డి అనే వ్యాపారస్థునికి చెందిన PDS బియ్యమని తెలిపి నట్లు ఎస్ ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author