PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేటాయించాలి

1 min read

-యువస్పందన సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర బాబు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్పందన సొసైటీ అధ్యక్షులు సురేంద్రబాబు కోరారు. శనివారం పత్తికొండ పట్టణంలోనే ఆర్డీవో కార్యాలయంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని యువ స్పందన సొసైటీ సభ్యులు ఆర్డీవో మోహన్ దాస్ కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన ప్రాంతమైన పత్తికొండలో విద్యార్థుల భవిష్యత్తు ను, అలాగే వారి ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని కొన్ని దశాబ్దాలుగా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని పత్తికొండ ప్రజలు కోరుతున్నారన్నారు. ప్రభుత్వం కూడా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, తరువాత మొండి చేయి చూయించడం జరుగుతూ వస్తుందన్నారు. వారం రోజుల క్రితం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివిధ జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయగా *వాటిలో పత్తికొండకి కేటాయించకపోవడం బాధాకరం అన్నారు. విద్యార్థుల ను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే పత్తికొండ కి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువస్పందన ట్రెజరర్ తులసిధర్ రెడ్డి, సభ్యులు నాయుడు, సోమశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author