ప్రభుత్వం ఉచితంగా విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాప్ లు
1 min read
13 మంది దివ్యాంగులకు రూ. 4.68 లక్షల విలువైన ల్యాప్ టాప్ లు అందజేత
విద్యకు ల్యాప్ టాప్ లు దోహదపడతాయి
జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఐ.టి.ఐ.పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న 13 మంది విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ల్యాప్ టాప్ లను పంపిణీచేశారు.సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆద్వర్యంలో రూ.4.68 లక్షల విలువైన ల్యాప్ టాప్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ చదువులో లాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.రెగ్యులర్ అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్దినీ విద్యార్ధులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లు అందించి వారి విద్యకు దోహదపడుతుందన్నారు. దృష్టి లోపం,బధిరులు,చలన వైకల్యముకల విద్యార్ధినీ,విద్యార్ధులకు వీటిని అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, విభిన్న ప్రతిబావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.