PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీరు బాగా పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది : జడ్పీటీసీ

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు:  మీరు బాగా పనిచేసినట్లైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి వాలంటీర్లతో అన్నారు.బుధవారం సాయంత్రం మాసపేట గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి మరియు సర్పంచ్ శంషున్ బి హాజరయ్యారు.ఈసందర్భంగా జెడ్పిటిసి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ మీకు కనబరచిన ఇండలో ప్రతి ఒక్క పథకాన్ని వారి దరికి చేరుస్తూ ఉండాలని ప్రజల దగ్గరికి చేరువ అయ్యి వాలంటీర్లు అంటే వారిలో నమ్మకం కలిగించే విధంగా మీరు ఉండాలని అదేవిధంగా మీరు బాగా పని చేసినట్లయితే వచ్చే సంవత్సరం సేవా వజ్ర,సేవా మిత్ర అవార్డులు మీకు వచ్చే విధంగా మీరు పనిచేయాలని అన్నారు.11 మంది వాలంటీర్లను జెడ్పిటిసి మరియు సర్పంచ్ తదితరులు ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా యుగంధర్ రెడ్డిని మరియు సర్పంచును శాలువాలతో సిబ్బంది ఘనంగా సత్కరించారు బుధవారం ఉదయం కడుమూరు సచివాలయంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జీవరత్నం,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,గ్రామ వైసిపి నాయకులు శంకర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి బి.శివకళ్యాణ్ సింగ్ 16 మంది వాలంటీర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,ఎంపిటిసి కమతం జయమ్మ,హౌసింగ్ ఇన్చార్జి ఏఈ రమేష్,పంచాయతీ కార్యదర్శి అస్రఫ్ భాష, ఎల్లారెడ్డి,మహబూబ్ బాష,సిబ్బంది పాల్గున,తేజేశ్వర్, రహీం,భాను,ఏఎన్ఎం కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

About Author