PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో సహకార సొసైటీ ప్రాంగణంలో వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 51 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లోకేశ్వర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ టి.నాగ తులసి రెడ్డి కేకును కట్ చేసి ఒకరి నొకరు తినిపించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పథకాల గురించి అదే విధంగా  ఆయన సేవలను నాయకులు కొనియాడారు.తర్వాత మిడుతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లను నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా, ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి,మల్లు శివ నాగిరెడ్డి,నారాయణరెడ్డి,కలమందలపాడు మహబూబ్ బాష,మాసపేట అన్వర్ భాష వివిధ గ్రామాల నాయకులు నారాయణరెడ్డి,గోపాల్ రెడ్డి,చిన్న రామచంద్రారెడ్డి,రామలింగారెడ్డి రవి పుల్లయ్య అబ్దుల్ ఘని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author