PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ మంత్రుల‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్ర‌భుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మ‌ధ్య వివాదం రాజుకుంటోంది. టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు పై ఇటీవ‌లి హీరో నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడ అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. అయితే.. సిద్ధార్థ్ వ్యాఖ్య‌లు ఎవ‌ర్ని ప్ర‌త్య‌క్షంగా ఉద్దేశించి చేసిన‌వి కాన‌ప్ప‌టికీ… టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు నేప‌థ్యంలోనే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ‘‘సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్‌ అందిస్తున్నామంటున్నారు మంత్రులు. మరి మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంత మంది విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు కాజేస్తున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్‌ ఇవ్వండి’’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. మ‌రి ఏపీ ప్ర‌భుత్వం దీనిపై స్పందిస్తుందా ? .. లేదా అన్న‌ది చూడాలి.

                                      

About Author