PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాంధీ లేరని హిందూత్వవాదులు భావిస్తున్నారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : మహాత్మా గాంధీ లేరని హిందూత్వ వాదులు భావిస్తున్నారని, ఆయన సజీవంగానే ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. సత్యం ఉన్న చోట ఆయన ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గాంధీజీ 74వ వర్థంతి సందర్భంగా ఆయన #ForeverGandhi హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆదివారం మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. ‘గాంధీజీని ఓ హిందుత్వవాది కాల్చి చంపాడు. గాంధీజీ లేరని హిందుత్వవాదులంతా భావిస్తున్నారు. సత్యం ఉన్న చోట బాపూ ఇంకా సజీవంగా ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘సత్యం, ప్రేమ ఎల్లప్పుడూ విజయం సాధించినట్లు చరిత్ర చెప్తోందనే విషయాన్ని నేను నిరుత్సాహంగా ఉన్నపుడు గుర్తు చేసుకుంటాను. నియంతలు, హంతకులు ఉన్నారు, కొంత కాలంపాటు వారు ఎదురులేనివారిగా కనిపిస్తారు. కానీ చివరికివారు పతనమవుతారు. ఎల్లప్పుడూ దీని గురించి ఆలోచించాలి’’ అని గాంధీజీ చెప్పిన మాటలను ఈ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు.

          

About Author