NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నన్నూరు వాసికి గౌరవ డాక్టరేట్…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ద్వారం .రామేశ్వరమ్మ ,ద్వారం.రామిరెడ్డి దంపతులకు జన్మించిన డి.జయ నారాయణ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అనంతపురం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నరు. డా. జయనారాయణ రెడ్డి , వ్యవసాయ రంగాన్ని డేటా శక్తితో ఆధునీకరించేందుకు లోతైన పరిశోధన చేశారు.” డీప్​ లర్నింగ్​ ఆధారంగా పంటల దిగుబడి అంచనా” అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన, భవిష్యత్తు వ్యవసాయానికి మార్గదర్శిగా నిలుస్తుంది. డా. ఎం. రుద్ర కుమార్  మార్గదర్శకత్వంలో జరిగిన ఈ అధ్యయనం, రైతుల నిర్ణయాలను శాస్త్రీయంగా మలిచేలా చేయడమే లక్ష్యం. చిన్ననాటి నుండి వ్యవసాయమే ప్రధానంగా కలిగిన కుటుంబంలో జన్మించిన డాక్టర్ జయ నారాయణ రెడ్డి తన తండ్రి  ఆలోచనలను తన ఆశయాలతో ముడిపెట్టి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రధాన భూమికకు సిద్ధపడ్డారని జేఎన్టీయూ ప్రొఫెసర్లు డాక్టర్ జయ నారాయణ రెడ్డిని కొనియాడడం జరిగింది. ఈ సందర్భంగా బంధువులు గ్రామ ప్రజలు డాక్టర్ జయనారాయణరెడ్డిని శుభాకాంక్షలతో ముంచెత్తారు. రాబోవు రోజుల్లో మన గ్రామ యువతకు మీరు మార్గదర్శకులుగా నిలుస్తారని పెద్దవారు జయనారాయణ రెడ్డిని అభినందించడం జరిగినది.సతీమణి ఆర్. శైలజ ,కుమారుడు డి.మేఘనాథ్ రెడ్డి లు మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.     “డేటాతో మాట్లాడే వ్యవసాయం కోసం ఒక మేధావి చేతి కలం పట్టాడు!”

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *