PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా వెంట్రుక కూడ పీక‌లేరు : జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌తిప‌క్షాల పై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలున్నంత వరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు’’ అని వ్యాఖ్యానించారు. తన తలలో వెంట్రుకలను పట్టుకుని… పీకినట్లుగా అభినయించి చూపించారు. పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారని… రాష్ట్ర ప్రభుత్వ పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీళ్లదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ‘గోరుముద్ద’ కోసం ఖర్చు చేసింది రూ.500 కోట్లేనని… తాము రూ.1900కోట్లు వెచ్చిస్తున్నామని జగన్‌ తెలిపారు. ‘‘ఈ విషయాన్ని రాయకుండా పల్లీ చిక్కి కవరు మీద జగనన్న ఫొటో ఉందని వీళ్లందరూ రాస్తారు. ఈ కడుపు మంటకు, అసూయకు మందే లేదు. ఇవి ఎక్కువైతే కచ్చితంగా వీళ్లందరికీ బీపీ వస్తుంది. కచ్చితంగా ఏదో ఒకరోజు గుండెపోటు వచ్చి టికెట్టు కొంటారు’’ అని శాపనార్థాలు పెట్టారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఈ మూడేళ్లలో రూ.10,298 కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ చర్యల వల్ల డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయన్నారు.

                                

About Author