PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలా జ‌రిగితే మ‌ళ్లీ వైసీపీదే అధికారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ రాజ‌కీయాల పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో త్వరలో అద్భుతం జరగబోతోందని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ భవిష్యత్ కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పొత్తులపై చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులుండాలని ఆకాంక్షించారు. ఏపీ నిర్మాణానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని కోరారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే చూద్దామన్నారు. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

                             

About Author