PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్రం నిధులిస్తే.. పక్కదారి మళ్లిస్తారా..!

1 min read

– సీఎం జగన్​పై బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోమిన్​ షబానా
పల్లెవెలుగు వెబ్​, ఆత్మకూరు: బిందు సేద్యం పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నాబార్డు నిధులు మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించడం ఏమిటని బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోమిన్​ షబానా ప్రశ్నించారు. ప్రధాన మంత్రి కృషి సంచాయ్​ యోజన నిధులు, నాబార్డు నిధులు కలిపి మొత్తం రూ.1028 కోట్లు వ్యవసాయ బిందు సేద్యం పరికరాల కోసం కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ మంగళవారం బీజేపీ కార్యాలయంలో నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోమిన్​ షబానా మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణ రెడ్డి, మండల ముస్లిం మైనార్టీ మోర్చా నూరు బాషా, ఎస్సీ మోర్చా మండల నాయకులు మహేష్ , కిసాన్ మోర్చా నాయకులు సుబ్రమణ్యం, రాజు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

About Author