PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాదయాత్ర అడ్డుకుంటే వైసిపి ప్రభుత్వ పతనం ఖాయం

1 min read

– కే.ఈ. శ్యామ్ కుమార్ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. శనివారం కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, యువత ఉద్యోగాలు లేక ఎదుర్కొంటున్న నష్టాలను తెలుసుకొనుటకు “యువగళం ” పేరుతో చేస్తున్న శాంతియుత పాదయాత్రకు వసున్న స్పందనను చూసి భయపడిన రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో లోకేష్ బాబు ప్రసంగించే వాహనాలు స్వాధీనం చేసుకోవడం , రాత్రులు కరెంటు తీయడం పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను గాయపరచడం వంటి దుశ్చర్యలు తక్షణమే మానుకోవాలి అని గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర కు పత్తికొండ కు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు మా సొంత హోల్డింగ్ కు జగన్ బ్యానర్ కట్టుకుంటాము అని అడిగితే ఇచ్చాము, అది తెలుగుదేశం పార్టీ నిబద్దత అని జగన్ కానీ షర్మిల పాదయాత్ర చేసినపుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ గొడవలు లేకుండా పోలీసుల సెక్యూరిటి ఏర్పాటు చేయించారు .ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర పట్ల ఎంత అణచివెత ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానికి నాలుగు రెట్లు భవిష్యత్తు లో ప్రతిస్పందన స్పందన ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంబశివా రెడ్డి, అశోక్ కుమార్, రామానాయుడు, సొమ్ల నాయక్, బత్తిన లోకనాథ్, బిటీ గోవింద్, తిరుపాల్ నాయుడు, కడవలసుదాకర్, శివరాముడు, మునినాయుడు, రామానాయుడు, వీరేష్, సోమన్న తదితర పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author