PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగికి ఓటెయ్యకుంటే.. జేసీబీలు, బుల్డోజ‌ర్లు ఎదుర్కొవాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్‌డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యూపీలో ఉండాలంటే యోగి అనాల్సిందేనని.. ఆయనకు జై కొట్టాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేడు రాజాసింగ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యూపీలో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. హిందువులంతా ఏకమవ్వాలి. యోగికి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. యూపీలో ఉండాలంటే యోగికి జైకొట్టాలి. లేకపోతే యూపీ వదిలి వెళ్లాల్సిందే. యూపీలో యోగిబాబా ప్రభుత్వం రాబోతుంది’’ అంటూ యూపీ ప్రజల్ని హెచ్చరించారు.

                              

About Author