PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బెంగ‌ళూరులో.. ఆఫ్రిక‌న్ లాకప్ డెత్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డ్రగ్స్‌ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన ఆఫ్రికన్‌ పౌరుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. జేసీ నగర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆఫ్రికన్‌ పౌరున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి 5 గ్రాములు ఎండీఎంఏ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం లాకప్‌లో నిర్బంధించారు. అతనికి ఆరోగ్యం బాగాలేదని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత‌డు ఆస్పత్రిలో చనిపోయాడు. దీంతో పెద్దసంఖ్యలో ఆఫ్రికన్‌ పౌరులు పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేష‌న్ ఎదుట‌ ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు పోలీసులపై దాడికి దిగడంతో లాఠీచార్జి చేశారు. మృతుని వివరాలు వెల్లడించలేదు.

About Author