PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాసంలో..శ్రీశైలం పాదయాత్ర..

1 min read

పల్లె వెలుగువెబ్, గడివేముల: పాణ్యం నియోజకవర్గంలోని గని గ్రామానికి చెందిన భక్తులు పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు పాదయాత్రగా బయలుదేరారు. కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా 78 మంది భక్తులు పాదయాత్రగా వెళ్లారు. కార్తీక మాసంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడం అదృష్టంగా భావించే భక్తులు పాదయాత్రగా వెళ్తున్నారు. గత 27 సంవత్సరాలుగా పాదయాత్రగా వెళ్లే భక్తులకు భోజనం, వసతిని పాదయాత్రకమిటీ సభ్యలు గని ప్రతాప రెడ్డి, ఎలుకురు శివప్ప, ప్రభాకర్​ రెడ్డి, సర్వేశ్వరయ్య ఏర్పాటు చేశారు.

About Author