PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాంధీ బదులు నేతాజీ బొమ్మ ఉండాలి !

1 min read

పల్లెవెలుగువెబ్ : కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీకి బదులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఫొటోను ముద్రించాలంటూ అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) డిమాండ్ చేసింది. స్వాతంత్య్ర సాధన పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన సేవలు, మహాత్మాగాంధీ కంటే ఎంత మాత్రం తక్కువ కాదని పేర్కొంది. ‘‘దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి నేతాజీ అందించిన సేవలు మహాత్మాగాంధీ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మా అభిప్రాయం. కనుక భారతదేశ గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడైన నేతాజీని గౌరవించేందుకు గొప్ప మార్గం.. కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మను ముద్రించడమే. గాంధీజీ ఫొటో స్థానంలో నేతాజీ చిత్రాన్ని ప్రవేశపెట్టాలి’’ అని ఏబీహెచ్ఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రచూర్ గోస్వామి అన్నారు. దీనిపై కాంగ్రెస్, టీఎంసీ లు విమర్శలు చేశాయి. బెంగాల్ లో విభజన రాజకీయాలను బీజేపీ మానుకోవాలని సూచించాయి.

About Author