శివ దీక్షాపరులకు అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయం
1 min read
పల్లెవెలుగు ,కర్నూలు: మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు నగరంలోని నగరేశ్వర స్వామి దేవాలయంలో శ్రీశైల శివ దీక్ష పరులు కి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బుల్లెట్ అంజి ఆద్వర్యం లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నగరేశ్వర స్వామి దేవాలయంలో గత 25 గత సంవత్సరాల నుంచి శివమాల ధరించిన శివ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయమని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గత 25సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం, ఆ కైలాసనాధుడి కృపా కటాక్షాలు శివ దీక్షాపరుల సేవా సమితికి ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు. ఇదే సందర్భంగా నగరంలో ఉన్న శివ దీక్ష స్వీకరించిన భక్తులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు భక్తులు వైఎస్ఆర్సిపి నాయకులు ఎస్వీ యూత్ పాల్గొన్నారు.