PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాదాస్ప‌ద డేరా బాబాకు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హ‌ర్యానా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ముఖ బాబా, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. జైలు బయట ఉన్న సమయంలో హర్యానా ప్రభుత్వం అతనికి జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. డేరాబాబాకు అత్యున్నత స్థాయి భద్రతను మంజూరు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య, ఇద్దరు డేరా శిష్యులపై అత్యాచారం కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న రామ్ రహీమ్ ఫిబ్రవరి 7న 21 రోజుల పెరోలుపై రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి విడుదలయ్యారు.

                                        

About Author